ప్రపంచకప్‌లో దాయాది జట్టుపై ఆరు వికెట్ల విజయం

John Doe October 07, 2024

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచ కప్ లో టీమిండియా బోణీ కొ ట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన హర్మన్‌సేన ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజ యం సాధించింది. దీంతో టోర్నీలో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో టా స్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 18.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ (32; 35 బంతు ల్లో 3 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (29 * రిటైర్డ్ హర్ట్), జెమీమా రోడ్రిగ్స్ (23) రాణించా రు. పాక్ బౌలర్లలో ఫాతిమా రెండు, సాదియా ఇక్బాల్, ఒమైమా తలో వికెట్ పడగొట్టారు. భార త్ తన తరువాతి మ్యాచ్ అక్టోబర్ 9న శ్రీలంకతో ఆడనుంది.

ఈనాడు, తిరుపతి: తన స్వగ్రామంలోని అమ్మవారి ఆలయానికి రాకపోకలు సాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదారతతో దారి చూపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీ నారావారిపల్లెలోని నాగాలమ్మ ఆలయంలో గ్రామస్థులు నిత్యం పూజలు చేస్తుంటారు. ఏటా సంక్రాంతి సందర్భంగా కుటుంబసమేతంగా స్వగ్రామానికి వచ్చే చంద్రబాబు కూడా నాగాలమ్మకు పూజలు చేయడం ఆనవాయితీ. ఈ ఆలయానికి వెళ్లేందుకు సరైన దారి లేదని స్థానికులు ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ రోడ్డు వేసేందుకు ప్రైవేటు స్థలాలు అడ్డుగా ఉండటంతో చంద్రబాబు తానే 90 సెంట్ల విస్తీర్ణాన్ని కొనుగోలు చేశారు. ఆ భూమిలోంచి రాకపోకలకు మార్గం సుగమం చేశారు.